Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన మూడు రోజులకే వధువు మృతి.. పెద్దల అంగీకారంతోనే ప్రేమ పెళ్ళి.. ఏమైందో?

పెళ్లై మూడు రోజులైంది. కాళ్ల పారాణి ఆరక ముందే అనుమానాస్పద రీతిలో ఆ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. పెళ్లైన మూడు రోజులకే పెళ్లిబాజాలు మోగిన ఆ ఇంట మృత్యు ఘంటికలు మోగాయి. పెళ్లి సందడితో కళకళలాడిన ఇల్లు బంధ

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2016 (10:05 IST)
పెళ్లై మూడు రోజులైంది. కాళ్ల పారాణి ఆరక ముందే అనుమానాస్పద రీతిలో ఆ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. పెళ్లైన మూడు రోజులకే పెళ్లిబాజాలు మోగిన ఆ ఇంట మృత్యు ఘంటికలు మోగాయి. పెళ్లి సందడితో కళకళలాడిన ఇల్లు బంధువుల రోదనతో శోకసంద్రంలో మునిగిపోయింది.

ప్రేమించి పెళ్లాడిన భర్త ఆమె మృతికి కారణమయ్యాడని కుటుంబ సభ్యులు రోదించారు. ఈ ఘటన పశ్చిమగోదావరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా పెర్కిపాలెం గ్రామానికి చెందిన చిక్కాల శైలజ (22)కు బుధవారం వివాహం కాగా శనివారం నాటికి మృత్యు ఒడికి చేరింది.
 
పెర్కిపాలెం గ్రామానికి చెందిన చిక్కాల నారాయణరావు కుమారై శైలజకు శృంగవృక్షం గ్రామానికి చెందిన కవురు ఏసుబాబుతో బుధవారం ఈ నెల 17న వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. పెద్దల అంగీకారంతోనే వీరిద్దరి వివాహం అట్టహాసంగా జరిగింది. కాగా శనివారం మధ్యా హ్నం కొత్త దంపతులు గొడవపడ్డారు.

గొడవ జరిగిన కొద్ది సేపటికే శైలజ పడకగదిలో ఉరివేసుకుని ఉందని, తాము చూసేసరికి మృతి చెందిందని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. శైలజ తండ్రి నారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు ఏసుబాబును అదుపులోకి తీసుకున్నారు.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments