Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో వాయుగుండం : మూడు జిల్లాలో భారీ వర్ష సూచన

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (11:54 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది చెన్నకు 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ  శాఖ తెలిపింది. 
 
ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంగా మారి వచ్చే 48 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు కదిలే అవకాశం ఉందని వెల్లడించారు.
 
ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. అందువల్ల మంగళవారం వరకూ సముద్రంలోకి జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. 
 
రాబోయే రెండో రోజుల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ బంగాళాఖాతంలో మధ్య భాగాలపై విస్తరించిన ఉపరితల ఆవర్తన ద్రోణి తీవ్ర అల్పపీడనం మారింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారనుందని పేర్కొంది. 
 
పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి వచ్చే 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకునివున్న  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో క్రమంగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments