Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమ జిల్లాలను ఆదుకుంటాం... బీజేపీ నేతలు

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (20:58 IST)
భూగర్భ జలాలు అడుగంటిపోయి కరువుతో అల్లాడిపోతున్న రాయలసీమను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు స్పష్టం చేశారు. రాయలసీమ జిల్లాలలో కరువు పర్యటన చేస్తున్న వారు మంగళవారం చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాలలో పర్యటించారు. ఎండిపోయిన దుర్భిక్ష పరిస్థితులను చూసి నాయకులు చలించిపోయారు.

ప్రధానంగా సాగునీరు, తాగునీటికి కరువు ఏర్పడిందని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో రాయలసీమను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందనే అంశాన్ని తాము గుర్తించామని అందుకే తమ పార్టీ తరపున పర్యటనలు చేపట్టినట్లు ఆయన వివరించారు.
 
చిత్తూరు జిల్లాలో పర్యటన ముగించుకున్న బృందం నేరుగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో అడుగు పెట్టింది. అక్కడ పూర్తి స్థాయిలో ఎండిపోయిన బత్తాయి తోటలను పరిశీలించారు. ఇక్కడ పరిస్థితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేస్తామని వారు తెలిపారు. ఈ బృందంలో మాజీ మంత్రి పురందరీశ్వరీ, రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments