Webdunia - Bharat's app for daily news and videos

Install App

సజావుగా ఎంసెట్ కౌన్సిలింగ్ : సుప్రీంను ఆశ్రయిస్తాం!

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (18:59 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ బుధవారం జరుగనుంది. ఈ ప్రక్రియను సజావుగా కొనసాగేందుకు వీలుగా సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. చట్టప్రకారం ప్రవేశాలను మండలి చేపడుతుందని వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. అడ్మిషన్లు, కౌన్సిలింగ్‌ను ఆపమని సుప్రీం కోర్టు పేర్కొనలేదని ఆయన చెప్పారు. 
 
విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టుకు మండలి విన్నవించనున్నట్లు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. చట్టప్రకారం అడ్మిషన్లు జరిపే అధికారం ఉన్నత విద్యా మండలికి ఉందని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. 
 
కౌన్సిలింగ్ త్వరగా ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విన్నపాలు వస్తున్నాయని చెప్పారు. ఆగస్టు 7 నుంచి విద్యార్థుల సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 4న సుప్రీం కోర్టు తీర్పు తర్వాత మళ్లీ సమావేశమవుతామని చెప్పారు. ఆలస్యానికి కారణాలతో సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments