Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిన వాలంటీర్ - భార్య ఆత్మహత్యాయత్నం

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై అనేక రకాలైన విమర్శలు వస్తున్నాయి. వలంటీర్లుగా పని చేసే అనేక మంది వివిధ రకాలైన నేరాలకు ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వాలంటీర్ వ్యవహారశైలి భార్యాభర్తల మధ్య చిచ్చురేపింది. దీంతో వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం రావులపాడులో ఒక వాలంటీర్ సమాచారం కోసమంటూ ఓ వివాహిత ఇంటికి తరచూ వెళ్తూ వేధించసాగాడు. ఇది భర్తకు తెలియడంతో ఆ దంపతుల మధ్య మనస్పర్థలు చెలరేగి వివాదానికి దారితీసింది. దీంతో ఇద్దరి మధ్య అగాధం పెరిగి బుధవారం ఆ మహిళ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు బాధితురాలిని శ్రీకాళహస్తి ఆసుపత్రికి తీసుకెళ్లారు. తరువాత మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments