Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిన వాలంటీర్ - భార్య ఆత్మహత్యాయత్నం

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై అనేక రకాలైన విమర్శలు వస్తున్నాయి. వలంటీర్లుగా పని చేసే అనేక మంది వివిధ రకాలైన నేరాలకు ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వాలంటీర్ వ్యవహారశైలి భార్యాభర్తల మధ్య చిచ్చురేపింది. దీంతో వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం రావులపాడులో ఒక వాలంటీర్ సమాచారం కోసమంటూ ఓ వివాహిత ఇంటికి తరచూ వెళ్తూ వేధించసాగాడు. ఇది భర్తకు తెలియడంతో ఆ దంపతుల మధ్య మనస్పర్థలు చెలరేగి వివాదానికి దారితీసింది. దీంతో ఇద్దరి మధ్య అగాధం పెరిగి బుధవారం ఆ మహిళ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు బాధితురాలిని శ్రీకాళహస్తి ఆసుపత్రికి తీసుకెళ్లారు. తరువాత మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments