ఇష్టమైన వైజాగ్ నుంచి జనసేనలోకి చేరికలు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం

వరుణ్
మంగళవారం, 6 ఆగస్టు 2024 (20:30 IST)
తనకు ఇష్టమైన వైజాగ్ నగరం నుంచే జనసేన పార్టీలోకి చేరికలు ప్రారంభంకావడం సంతోషంగా ఉందని జనసేన పార్టీ అధినే, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్టణానికి చెందిన ఐదుగురు వైకాపా కార్పొరేటర్లు మంగళవారం పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి పవన్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇన్నాళ్లు ప్రభుత్వ పనుల్లో బిజీగా ఉన్నాను. నాకు ఇష్టమైన విశాఖపట్టణం నుంచే జనసేన పార్టీలోకి చేరికలు ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. వైకాపా నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. ఇదే విషయం గతంలో పలుమార్లు చెప్పాను. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. జనసేన పార్టీలో చేరిన వారందరికీ నా తరపున ధన్యవాదాలు. మీ సేవలను పార్టీ గుర్తిస్తుంది. 
 
అందరం కలిసి పనిచేద్దాం. ప్రజలకు సేవ చేద్దాం. భవిష్యత్ విశాఖపట్టణం కార్పొరేషన్‌‍లో కూటమి విజయకేతనం ఎగురవేయాలి అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, వైకాపాకు చెందిన కార్పొరేటర్లు ఇతర పార్టీల్లోకి జారుకుంటుండటంతో జిల్లాకు చెందిన వైకాపా నేతలు షాక్‌కు గురవుతున్నారు. పైగా, గత పాలనలో జరిగిన తప్పులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments