Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ సిద్ధం... ఏపీ ప్రభుత్వం స్థలం ఇవ్వడం లేదు : మంత్రి అశ్వినీ

ఠాగూర్
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (16:38 IST)
విభజన హామీల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్‌ను విశాఖపట్టణం కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా తయారైందని కానీ, రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని మాత్రం ఏపీ ప్రభుత్వం కేటాయించడం లేదని కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 
 
లోక్‌సభలో గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆయన మాట్లాడుతూ, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేవలం 53 ఎకరాల భూమిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఇప్పటికే అడిగామని కానీ, ఇప్పటివరకు అప్పగించలేదని చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటుకు డీపీఆర్ కూడా సిద్ధమైందన్నారు. భూమి అస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
 
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.886 కోట్ల నిధులు ఇవ్వగా ప్రస్తుత బడ్జెట్‌లో ఒక్క ఏపీకే రూ.9138 కోట్లు కేటాయించామని తెలిపారు. ఆంధ్రాలో యేడాదికి 240 కిలోమీటర్ల మేరకు కొత్త ట్రాక్ నిర్మాణం సాగుతుందన్నారు. 98 శాతం విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని వివరించారు. అలాగే, ఈ బడ్జెట్‌లో తెలంగాణాకు రూ.5071 కోట్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments