విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ సిద్ధం... ఏపీ ప్రభుత్వం స్థలం ఇవ్వడం లేదు : మంత్రి అశ్వినీ

ఠాగూర్
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (16:38 IST)
విభజన హామీల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్‌ను విశాఖపట్టణం కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా తయారైందని కానీ, రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని మాత్రం ఏపీ ప్రభుత్వం కేటాయించడం లేదని కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 
 
లోక్‌సభలో గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆయన మాట్లాడుతూ, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేవలం 53 ఎకరాల భూమిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఇప్పటికే అడిగామని కానీ, ఇప్పటివరకు అప్పగించలేదని చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటుకు డీపీఆర్ కూడా సిద్ధమైందన్నారు. భూమి అస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
 
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.886 కోట్ల నిధులు ఇవ్వగా ప్రస్తుత బడ్జెట్‌లో ఒక్క ఏపీకే రూ.9138 కోట్లు కేటాయించామని తెలిపారు. ఆంధ్రాలో యేడాదికి 240 కిలోమీటర్ల మేరకు కొత్త ట్రాక్ నిర్మాణం సాగుతుందన్నారు. 98 శాతం విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని వివరించారు. అలాగే, ఈ బడ్జెట్‌లో తెలంగాణాకు రూ.5071 కోట్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments