Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ సిద్ధం... ఏపీ ప్రభుత్వం స్థలం ఇవ్వడం లేదు : మంత్రి అశ్వినీ

ఠాగూర్
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (16:38 IST)
విభజన హామీల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్‌ను విశాఖపట్టణం కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా తయారైందని కానీ, రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని మాత్రం ఏపీ ప్రభుత్వం కేటాయించడం లేదని కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 
 
లోక్‌సభలో గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆయన మాట్లాడుతూ, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేవలం 53 ఎకరాల భూమిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఇప్పటికే అడిగామని కానీ, ఇప్పటివరకు అప్పగించలేదని చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటుకు డీపీఆర్ కూడా సిద్ధమైందన్నారు. భూమి అస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
 
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.886 కోట్ల నిధులు ఇవ్వగా ప్రస్తుత బడ్జెట్‌లో ఒక్క ఏపీకే రూ.9138 కోట్లు కేటాయించామని తెలిపారు. ఆంధ్రాలో యేడాదికి 240 కిలోమీటర్ల మేరకు కొత్త ట్రాక్ నిర్మాణం సాగుతుందన్నారు. 98 శాతం విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని వివరించారు. అలాగే, ఈ బడ్జెట్‌లో తెలంగాణాకు రూ.5071 కోట్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments