Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాబులకు విచిత్రమైన శిక్షలు విధించిన వైజాగ్ పోలీసులు

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (08:57 IST)
విశాఖపట్టణంలో కొందరు మందుబాబులకు స్థానిక పోలీసులు విచిత్రమైన శిక్షలు విధించారు. మద్యంసేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన మద్యంబాబులను కోర్టులో హాజరుపరిచారు. వీరందరికీ ఒక్క రోజు పాటు వైజాగ్ ఆర్కే బీచ్‌లో బీచ్‌లో ఉండే చెత్తను తొలగించాలంటూ న్యాయమూర్తి శిక్ష విధించారు. దీంతో మందుబాబులందరినీ బీచ్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. వారితో బీచ్‌ను శుభ్రం చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
గత వారాంతంలో విశాఖ పోలీసులు విస్తృతంగా డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మందుబాబులు భారీ సంఖ్యలో పట్టుపడ్డారు. ఇలా పట్టుబడినవారిలో 52 మందిని విశాఖ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి వారికి ఆసక్తికరమైన శిక్ష విధించారు. విశాఖ ఆర్కే బీచ్‌లో చెత్తను ఏరివేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్‌ను శుభ్రం చేయాలంటూ ఆదేశించారు. దాంతో పోలీసులు వారిని బీచ్‌కు తీసుకెళ్లి న్యాయమూర్తి విధించిన శిక్షను అమలు చేశారు. 

 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments