Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (11:51 IST)
వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఆ పార్టీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను పులివెందులలోని అవినాశ్ రెడ్డి సీబీఐ అధికారులు వెళ్లి అందజేశారు. మార్చి ఆరో తేదీ సోమవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలిపారు.
 
మరోవైపు, ఈ నోటీసులపై అవినాశ్ రెడ్డి స్పందించారు. తాను సోమవారం విచారణకు హాజరుకాలేనని సీబీఐ అధికారులకు స్పష్టంచేశారు. అయితే, ఆరో తేదీన ఖచ్చితంగా విచారణకు వచ్చితీరాల్సిందేనంటూ సీబీఐ అధికారులు హుకుం జారీచేశారు. 
 
మరోవైపు, ఇదే కేసుకు సంబంధించి అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీచేసిన విషయం తెల్సిందే. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా భాస్కర్ రెడ్డికి ఇచ్చిన నోటీసులు జారీ చేయగా, తాజాగా ఈ నెల 6వ తేదీనే విచారణకు హాజరుకావాలని ఆయనకు సీబీఐ అధికారులు సూచించారు. అయితే, అవినాశ్ రెడ్డి విచారణ హైదరాబాద్ నగరంలోనూ, భాస్కర్ రెడ్డి విచారణ పులివెందులలోనూ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments