వివేకా హత్య కేసు : కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (11:51 IST)
వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఆ పార్టీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను పులివెందులలోని అవినాశ్ రెడ్డి సీబీఐ అధికారులు వెళ్లి అందజేశారు. మార్చి ఆరో తేదీ సోమవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలిపారు.
 
మరోవైపు, ఈ నోటీసులపై అవినాశ్ రెడ్డి స్పందించారు. తాను సోమవారం విచారణకు హాజరుకాలేనని సీబీఐ అధికారులకు స్పష్టంచేశారు. అయితే, ఆరో తేదీన ఖచ్చితంగా విచారణకు వచ్చితీరాల్సిందేనంటూ సీబీఐ అధికారులు హుకుం జారీచేశారు. 
 
మరోవైపు, ఇదే కేసుకు సంబంధించి అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీచేసిన విషయం తెల్సిందే. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా భాస్కర్ రెడ్డికి ఇచ్చిన నోటీసులు జారీ చేయగా, తాజాగా ఈ నెల 6వ తేదీనే విచారణకు హాజరుకావాలని ఆయనకు సీబీఐ అధికారులు సూచించారు. అయితే, అవినాశ్ రెడ్డి విచారణ హైదరాబాద్ నగరంలోనూ, భాస్కర్ రెడ్డి విచారణ పులివెందులలోనూ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments