Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (11:51 IST)
వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఆ పార్టీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను పులివెందులలోని అవినాశ్ రెడ్డి సీబీఐ అధికారులు వెళ్లి అందజేశారు. మార్చి ఆరో తేదీ సోమవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలిపారు.
 
మరోవైపు, ఈ నోటీసులపై అవినాశ్ రెడ్డి స్పందించారు. తాను సోమవారం విచారణకు హాజరుకాలేనని సీబీఐ అధికారులకు స్పష్టంచేశారు. అయితే, ఆరో తేదీన ఖచ్చితంగా విచారణకు వచ్చితీరాల్సిందేనంటూ సీబీఐ అధికారులు హుకుం జారీచేశారు. 
 
మరోవైపు, ఇదే కేసుకు సంబంధించి అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీచేసిన విషయం తెల్సిందే. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా భాస్కర్ రెడ్డికి ఇచ్చిన నోటీసులు జారీ చేయగా, తాజాగా ఈ నెల 6వ తేదీనే విచారణకు హాజరుకావాలని ఆయనకు సీబీఐ అధికారులు సూచించారు. అయితే, అవినాశ్ రెడ్డి విచారణ హైదరాబాద్ నగరంలోనూ, భాస్కర్ రెడ్డి విచారణ పులివెందులలోనూ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanthi: అప్పట్లో ఐస్ క్రీమ్ తిన్నా, అందుకే అమ్మకు కేక్ తినిపిస్తున్నా: కళ్యాణ్ రామ్

Namrata: మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన నమ్రతా శిరోద్కర్

మెగాస్టార్‌తో కలిసి సంక్రాంతికి వస్తాం : దర్శకుడు అనిల్ రావిపూడి

Mythri Movies : తమిళ సినిమా కిస్ కిస్ కిస్సిక్ కు మైత్రీమూవీస్ సపోర్ట్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ టైటిల్ ప్రదీప్ మాచిరాజు కు కలిసివస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments