వైఎస్ వివేకా హత్య కేసు : రెండో రోజు విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (10:11 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి రెండోరోజైన గురువారం సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలోని కోఠిలో ఉన్న సీబీఐ కార్యాలయానికి ఆయన గురువారం ఉదయమే చేరుకున్నారు. ఈ విచారణలో భాగంగా తొలి రోజు అయిన బుధవారం నాడు అవినాష్ రెడ్డి వద్ద సీబీఐ అధికారులు సుధీర్ఘంగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు విచారించారు. 
 
వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. నిందితులతో జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఎంపీని సీబీఐ అధికారులు అనేక రకాలుగా ప్రశ్నించారు. ముఖ్యంగా రూ.40 కోట్ల డీల్‌కు సంబంధించి అవినాష్ రెడ్డి పాత్రపై ఆరా తీశారు. సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారంటూ సీబీఐ నిలదీసింది. 
 
మరోవైపు, సీబీఐ కొత్త ఆఫీసర్ వికాస్ సింగ్‌కు అవినాష్ రెడ్డి లేఖ రాశారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజున దొరికిన లేఖపై దర్యాప్తు జరపాలని కోరారు. వికేకా ఫోనులో ఉన్న వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వివేకా అల్లుడైన రాజశేఖర్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments