చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది.. 2019లో జగనే సీఎం: విష్ణుకుమార్ జోస్యం

ఏపీ సీఎం చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని.. రానున్న రోజుల్లో అదీ కాస్త పూర్తిగా పడిపోతుందని.. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు..

Webdunia
గురువారం, 3 మే 2018 (15:54 IST)
ఏపీ సీఎం చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని.. రానున్న రోజుల్లో అదీ కాస్త పూర్తిగా పడిపోతుందని.. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు.. హైదరాబాదులో వుంటే ఇబ్బందులు వస్తాయని భావించారన్నారు.


అందుకే అక్కడి నుంచి పారిపోయి., విజయవాడకు మకారం మార్చారని విష్ణు సెటైర్లు విసిరారు. అంతేగాకుండా.. 2019 ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని.. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని విష్ణు జోస్యం చెప్పారు. 
 
గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం విష్ణుకుమార్ రాజు మీడియా మాట్లాడుతూ.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని తెలుగు వారు బీజేపీకి ఓటు వేయొద్దని చంద్రబాబు పిలుపు ఇవ్వడం ఏమిటని మండిపడ్డారు.

చంద్రబాబు పిలుపుతో కర్ణాటకలో ఉన్న తెలుగువారు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వుందని తెలిపారు. టీడీపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విష్ణు ఆరోపణలు చేశారు. టీడీపీ అవినీతిని త్వరలోనే బహిర్గతం చేస్తామని విష్ణు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments