Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలి గాయానికి చికిత్స చేయమని ఆస్పత్రికెళితే... కాటికి పంపిన వైద్యులు.. ఎక్కడ?

కాలి గాయానికి చికిత్స చేయమని ఆస్పత్రికి వెళితే వైద్యులు ఏకంగా కాటికే పంపించేశారు. ఈ దారుణం విశాఖపట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌కు చెందిన గన్నారపు శివప్రస

Webdunia
ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (11:00 IST)
కాలి గాయానికి చికిత్స చేయమని ఆస్పత్రికి వెళితే వైద్యులు ఏకంగా కాటికే పంపించేశారు. ఈ దారుణం విశాఖపట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌కు చెందిన గన్నారపు శివప్రసాద్‌ (35) ఈపీడీసీఎల్‌ పరిధిలోని పాడేరు డివిజన్‌లో సబ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు నెలల క్రితం శివప్రసాద్‌ శబరిమలైలో కొండ మీదకు వెళుతుండగా కాలి బొటనవేలికి ఏదో గుచ్చుకొని గాయమైంది.
 
మందులు వాడినా తగ్గకపోవడంతో వైద్యులకు చూపించగా చిన్నపాటి శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరగా మరుసటిరోజు సాయంత్రం కాలి వేలికి శస్త్రచికిత్స చేశారు. రూంకు తరలించిన అనంతరం శివప్రసాద్‌ అందరితో బాగానే మాట్లాడారు. 
 
రాత్రి సుమారు 10.30 గంటలకు నొప్పి తగ్గేందుకు, గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకంటూ ఆస్పత్రి సిబ్బంది ఇంజక్షన్లు చేశారు. తర్వాత కొద్ది నిమిషాలకే శివప్రసాద్‌ నురగలు కక్కుకుంటూ కిందపడిపోగా... వైద్యులు ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు. కొద్దిసేపటికే శివప్రసాద్‌ మృతిచెందినట్టు కుటుంబ సభ్యులకు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శివప్రసాద్ చనిపోయారంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments