Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ విద్యార్థినికి అరుదైన గౌరవం.. ఢిల్లీ స్వాతంత్ర్య వేడుకలకు ఆహ్వానం

ఠాగూర్
సోమవారం, 12 ఆగస్టు 2024 (08:29 IST)
విశాఖపట్టణానికి చెందిన ఓ విద్యార్థినికి అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనేందుకు ఆమెకు ఆహ్వానం వచ్చింది. విశాఖ సాగర్ నగర్ ప్రాంతానికి చెందిన డిగ్రీ విద్యార్థిని జయలిఖితకు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే 78వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆమెకు ఆహ్వానం అందింది. యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి యేటా ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్రం విద్యార్థులకు స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది. 
 
దీనికోసం మై భారత్ పేరుతో పోర్టల్ ఏర్పాటు చేసింది. ఆయా కేటగిరీల విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. ఏ యేడాది దేశ వ్యాప్తంగా ఎన్‌‌వైకే విభాగంలో వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, 68 మందిని ఎంపిక చేశారు. వీరిలో విశాఖకు చెందిన జయలిఖిత ఒకరు కావడం గమనార్హం.
 
సామాజిక సేవా కార్యక్రమాలు, విభిన్న అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, నెహ్రూ యువ కేంద్రం నిర్వహించే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని జయలిఖితకు అవకాశం కల్పించింది. తనకు దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించడం పట్ల జయలిఖిత హర్యం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments