Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకుల మృతి

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (15:35 IST)
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తొలిరోజే విశాఖలో ముగ్గురు యువకుల ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. విశాఖ బిఆర్టిఎస్ రోడ్డులో ఈ రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది. 
 
వేపగుంట ప్రాంతానికి చెందిన నితీష్, మోహన్ వంశీ.. ఓ బైక్ పై హనుమంతవాక వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదర్శనగర్ కు చెందిన రాకేష్, రాంబాబు మరో బైక్‌పై హనుమంతవాక నుంచి అడవివరం వైపు వెళుతున్నారు.
 
ఈ క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలు బిఆర్టిఎస్ రోడ్ లోని అపోలో హాస్పిటల్ ప్రాంతానికి వచ్చేసరికి.. ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే నితీష్, రాకేష్, రాంబాబు ప్రాణాలు కోల్పోయారు. 
 
మోహనవంశీ తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments