Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ గురుకుల బాలికల కళాశాలలో ప్రిన్సిపాల్ వేధింపులు.. స్నానాల గదిని బాగుచేయిస్తానని?

విశాఖ గురుకుల బాలికల కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అదీ గిరిజన విద్యార్థినులను చిన్నచూపు చూస్తూ వారిని లైంగికంగా వేధించాడు.

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (13:37 IST)
విశాఖ గురుకుల బాలికల కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అదీ గిరిజన విద్యార్థినులను చిన్నచూపు చూస్తూ వారిని లైంగికంగా వేధించాడు. ఈ విషయం కాస్త ఎమ్మెల్యే చెవులకు వెళ్ళడంతో.. సదరు ప్రిన్సిపాల్‌పై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా, గూడెం కొత్తవీధిలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు.. అక్కడి విద్యార్థినులకు లైంగికంగా వేధించాడు. దీనిపై  కళాశాల విద్యార్థినులు, కాంట్రాక్ట్ మహిళా లెక్చరర్లు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మంగళవారం నాడు గూడెం కొత్తవీధిలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కాలేజీని సందర్శించారు. ఫిర్యాదుపై విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వేధింపులపై విద్యార్థినులు ఎమ్మెల్యేతో చెప్పేశారు. ఒంటరిగా ఉంటే.. ఎప్పటికైనా దొరక్కపోతానా అనే వారని.. స్నానాల గదుల్ని మరమ్మతు చేయిస్తానని.. తనతో హైదరాబాద్ వస్తారా.. నిర్ణయం మీదే అంటూ.. రోజూ వేధింపులకు గురిచేసే వాడని విద్యార్థినులు వాపోయారు. అస్వస్థతకు గురైనప్పుడు వైద్యుడిని సంప్రదించకుండానే బయటి మార్కెట్లలో దొరికే మందులు, ఇంజెక్షన్సు ఇస్తున్నారని, ఆర్ఎంపీ వైద్యులతో అనుమతి లేకుండా చికిత్స చేయిస్తున్నారని మండిపడ్డారు.  
 
ఇకపోతే.. కలెక్టరు ప్రవీణ్‌కుమార్‌, గురుకులం కార్యదర్శి, ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమ శాఖ డీడీ దృష్టికి తీసుకెళ్లిన ఈ  విషయాన్ని ఎమ్మెల్యే ఈశ్వరి తీసుకెళ్లారు. ప్రిన్సిపాల్‌పై వారికి ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్‌ను తప్పించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం