Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగో జిల్లాలో బాలికపై గ్రామ వలంటీరు అత్యాచారం

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (09:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిటకు చేర్చాలన్న ఏకైక లక్ష్యంతో ప్రవేశపెట్టిన గ్రామ వలంటీర్లు ఇపుడు అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరిగా ఉండే మహిళలపై లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఓ గ్రామ వలంటీరు ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని సీతానగరం మండలం, బొబ్బిల్లంక అనే గ్రామంలో జరిగింది. 
 
అత్యాచారానికి పాల్పడిన వలంటీరును బూసి సతీష్‌ (21)గా గుర్తించారు. బొబ్బిల్లంక గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్న సతీష్... ప్రభుత్వ పథకాల చేరవేత పేరుతో తరచుగా ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఇటీవల బాలిక ఒక్కరే ఇంట్లో ఉండగా, ఇదే అదునుగా భావించిన కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. పైగా, ఈ విషయం బయటకు చెపితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది. 
 
అయితే, ఆ తర్వాత బాలిక ప్రవర్తనలో మార్పు రావడం, ముభావంగా ఉండటంతో తల్లి నిలదీయడంతో జరిగిన విషయం చెప్పి బోరున విలపించింది. దీంతో సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు సతీష్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆ బాలికను రాజమండ్రి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం