Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళంలో దారుణం - సచివాలయంలో బాలికపై వలంటీర్ అత్యాచారం

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (10:13 IST)
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. గ్రామ పరిపాలన కోసం ఏర్పాటుచేసిన సచివాలయంలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ దారుణానికి ఒడిగట్టింది వలంటీరే కావడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం నడుకూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నడుకూరు గ్రామానికి చెందిన బి.హరిప్రసాద్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే సచివాలయంలో వలంటీరుగా పని చేస్తున్నాడు. గత నెల 31వ తేదీ తన ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న 12 యేళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి సచివాలయానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
అతడికి రాంబాబు అనే యువకుడు పూర్తి సహాయ సహకారాలు అందించాడు. లైంగికదాడి తర్వాత ఆ బాలిక అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో నిందితులిద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. అయితే, తన చెల్లి కనిపించకపోవడంతో బాధితురాలి అక్క గ్రామంలో గాలిస్తూ సచివాలయానికి వచ్చింది. అక్కడ అపస్మారకస్థితిలోపడివున్న చెల్లిని చూసి బోరున విలపిస్తూ కేకలు వేసింది. ఆ తర్వాత దీనిపై తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments