Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారంరోజుల్లో విజయవాడ రోడ్లు మరమ్మత్తులు: ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కేశినేని శ్వేత

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (17:05 IST)
విజయవాడ 11వ డివిజన్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యూజిడి పనులు పూర్తి అయ్యిన యాదవుల బజార్, దానయ్యబజార్, భాగయ్యబజార్, కరణంగారి బజార్ లలో శుక్రవారం ఎమ్మెల్యే గద్దె రామమోహన్, టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కుమారి కేశినేని శ్వేత పర్యటించి రోడ్లు పరిశీలించారు.

వారంరోజుల్లో రోడ్లు మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్థానికులకు తెలియజేసారు. గడిచిన టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన అభివృద్ధి పనులకు వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని, దాని వల్ల కాంట్రాక్టర్లు పనులు చేయలేక పోతున్నారని అన్నారు.

ఈ రహదారుల విషయంలో సమస్య పరిష్కారించే విధంగా సంబంధిత మునిసిపల్ అధికారులతో మాట్లాడటం జరిగిందని, రోడ్లు మరమ్మతులకు వారం రోజులలో పనులు ప్రారంభించే విధంగా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని వారు చెప్పారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు, విజృంభిస్తున్న కరోనాపై మరింత జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించేందుకు డివిజన్ లో పర్యటిస్తున్నామని అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments