Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెవెన్ సిస్టర్స్ దందా.. వడ్డీ ఇవ్వలేదని బాలికను వేశ్యా గృహానికి అమ్మేశారు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2015 (12:00 IST)
ఇదేంటి సెవెన్ సిస్టర్స్ దందా.. కొత్తగా ఉందే అనుకుంటున్నారు కదూ.. నిజమేనండి నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయ రాజధానిగా రూపుదిద్దుకునే విజయవాడలో కొత్త దందాలు జడలు విప్పింది. కాల్ మనీ పేరిట రంగప్రవేశం చేసిన ఈ దందాలో వంద అప్పు తీసుకుంటే నెలకు రూ.30 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ తరహా నయాదందాలో సెవెన్ సిస్టర్స్ పేరిట నగరంలో వెలసిన ఓ సంస్థ తనదైన శైలిలో అరాచకాలకు పాల్పడుతోంది. డబ్బు అవసరమైన వ్యక్తులను గుర్తించి అప్పటికప్పుడే రుణాలిచ్చేస్తున్నప్పటికీ.. తదనంతరం తన నిజస్వరూపం ఏంటో చూపిస్తోంది. 
 
ఇలాంటి ఘటనే బెజవాడలో చోటుచేసుకుంది. నగరంలోని రాజరాజేశ్వరినగర్‌కు చెందిన సత్యవతి అనే మహిళ ఈ సంస్థ వద్ద తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీ చెల్లింపులో కాస్తంత వెనుకబడిందట. దీంతో రంగప్రవేశం చేసిన ‘సెవెన్ సిస్టర్స్’ దుర్మార్గులు ఆమె కూతురును అపహరించడమే కాకుండా ఆ బాలికను వేశ్యాగృహానికి అమ్మేశారట. 
 
దీంతో సదరు మహిళపై సెవెన్ సిస్టర్స్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దందారాయుళ్లను అరెస్ట్ చేసేందుకు గాను రంగంలోకి దిగారు. రూ.20 వేలు అప్పుగా తీసుకున్నందుకు తన కొడుకుతోనూ కూలీ పని చేయిస్తున్నారని ఆ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments