Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి.. ఆపై ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 5 మే 2019 (12:21 IST)
విజయవాడలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న కసాయి భర్త ఒకరు.. ఆమెను గొడ్డలితో నరికి చంపి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడలోని జక్కంపూడి కాలనీకి చెందిన నరసింహా రావు(56), కృష్ణాకుమారి(47) అనే దంపతులు ఉన్నారు. వీరికి 25 యేళ్ల క్రితం వివాహమైంది. వీరి పిల్లలకు కూడా వివాహాలు జరిగాయి.
 
వీరి సంసారం సాఫీగా సాగిపోతున్న తరుణంలో భార్యపై భర్తకు అనుమానం మొదలైంది. దీంతో వారిద్దరి మధ్య రోజూ గొడవలు ప్రారంభమయ్యాయి. గత రెండు రోజుల క్రితం భార్యతో నరసింహా రావు గొడవపెట్టుకున్నాడు. దీంతో భార్య ఇంటిని తన అక్కగారింటికి వెళ్లింది. భార్యకు భర్త ఫోన్ చేసి క్షమించాలని కోరడంతో పాటు ఇంటికి రమ్మని కబురుపంపాడు. 
 
పైగా, భర్త ఇంటికి వచ్చేసరికి భార్య నిద్రలోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన భర్త.. గొడ్డలి తీసుకొని భార్య నుదిటిపై ఒక్క వేటు వేశాడు. ఈ దాడిలో భార్య ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నరసింహా రావు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనయుడు జాఘవా తలుపులు కొట్టినా ఎంతకు తీయకపోవడంతో బలవంతంగా తలుపులను తెరిచి చూసేసరికి ఇద్దరు చనిపోయి ఉన్నారు. జాఘవా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments