Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టులో ఎదురుదెబ్బ.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య కేసులో నిందితుడు సరెండర్

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (10:33 IST)
విజయవాడకు చెందిన గుంటూరు కస్తూరి వైద్య కాలేజీ పీజీ విద్యార్థిని దేవీ ప్రియాంక (25) ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో ప్రధాన నిందితుడు నవీన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 
 
గతేడాది డిసెంబరు 31న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దేవీ ప్రియాంక.. తన చావుకు నవీనే కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నవీన్‌ను గుర్తించారు. పైగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న నవీన్ కూడా పీజీ జనరల్ సర్జన్‌ చేస్తున్నట్టు తెలుసుకున్నారు. 
 
అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం వేట ప్రారంభించారు. వారి కళ్లుగప్పి తిరుగుతున్న నవీన్ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించాడు. అయితే అక్కడ అతడికి ఎదురుదెబ్బ తగలడంతో మరో మార్గం లేక పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments