చిన్నమ్మతో రాములమ్మ భేటీ : పరప్పణ అగ్రహార జైలులో మంతనాలు

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (14:52 IST)
తమిళనాడు రాష్ట్రంలో చిన్నమ్మగా గుర్తింపు పొందిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళ నటరాజన్‌ను తెలుగునాట రాములమ్మగా గుర్తింపు పొందిన సినీ నటి విజయశాంతి కలుసుకున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ.. బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే.
 
శశికళతో ఎంతో సన్నిహిత సంబంధాలు కలిగివున్న విజయశాంతి... శుక్రవారం బెంగుళూరు వెళ్లి జైలులో కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌పై శశికళ ఆరా తీసినట్టు సమాచారం. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలకు సమానదూరం పాటించాలన్న ఉద్దేశ్యంతోనే శశికళ ఫెడరల్ ఫ్రెంట్‌పై ఆరా తీసినట్టు వినికిడి. 
 
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా విజయశాంతి ఆస్పత్రికి వెళ్లి జయ ఆరోగ్య పరిస్థితిపై శశికళ వద్ద వాకబు చేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళ ఉండాలని విజయశాంతి తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తంచేశారు. 
 
అంతేకాకుండా, జయలలిత మరణం కారణంగా జరిగిన ఆర్కే.నగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల సమయంలో కూడా శశికళ బంధువు దినకరన్‌ తరపున విజయశాంతి ప్రచారం కూడా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments