Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్, రాజ్యసభ ఎన్నికల్లో ఓటేశారు, టెన్షన్లో సహచర సభ్యులు

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (22:52 IST)
ఏపీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. దీనితో ప్రభుత్వ వర్గాల్లో ఒక్కసారి టెన్షన్ కనిపిస్తోంది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కరోనావైరస్ రావడం మొదటిది. పైగా ఈయన ఇటీవలే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటు కూడా వేసి రావడంతో ఆయనతో పాటు వెళ్లినవారందరికీ గుబులు పట్టుకుంది. ఇప్పటికే ఆయన గన్ మేన్‌కి కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.
 
విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే అయిన శ్రీనివాసరావు సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్‌తో కూడా భేటీ అయినట్లు తెలుస్తోంది. దీనితో ఆయనతో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో వారందరినీ హోం క్వారెంటైన్లో వుంచాల్సిన పరిస్థితి. మరోవైపు శ్రీనివాసరావు ఇటీవలే అమెరికా వెళ్లివచ్చినట్లు చెపుతున్నారు. అక్కడ నుంచి వచ్చిన ఆయనకు కరోనా లక్షణాలు వుండటంతో హోంక్వారెంటైన్లో వుంచి పరీక్షలు చేశారు. తొలుత నెగటివ్ అని వచ్చింది కానీ ఆ తర్వాత పాజిటివ్ అని తేలింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments