Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైరెక్టుగా వస్తే తట్టుకోగలవా... పప్పు తిని పడుకో చిట్టయ్యా...

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (20:12 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను లక్ష్యంగా చేసుకుని వైపాకా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు.
 
గురువారం పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతో నారా లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులోకి వైకాపా నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు కనెక్ట్ అయి లోకేష్‌కు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో వారి ఆడియోతో పాటు వీడియోను కట్ చేశారు. 
 
అదేసమయంలో విద్యార్థుల ఐడీలతో తన జూమ్ మీటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వైకాపా ఎమ్మెల్యేలపై లోకేష్ విరుచుకుపడ్డారు. దమ్ముంటే నేరుగా తనతో చర్చకురావాలంటూ ఆయన సవాల్ విసిరారు. 
 
ఈ సవాల్‌పై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. "జూమ్‌ మీటింగ్‌లోకి వస్తేనే తట్టుకోలేక మ్యూట్ చేసి పారిపోయావ్. నేరుగా రమ్మని సవాల్ విసిరావే. డైరెక్టుగా వస్తే తట్టుకోగలవా లోకేశం? చిన్న పిల్లలతో రాజకీయం చెయ్యడం కాదు. పోయి పప్పు తిని పడుకో చిట్టయ్యా" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments