Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ అడిగిన పారిశుద్ధ్య కార్మికులు.. దూరంగా నిల్చోమన్న మాజీ మంత్రి రోజా!! Video Viral

వరుణ్
బుధవారం, 17 జులై 2024 (10:59 IST)
వైకాపా మహిళా నేత, మాజీ మంత్రి, సినీ నటి ఆర్కే రోజా పారిశుద్ధ్య కార్మికులను కించపరిచేలా నడుచుకున్నారు. తనతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన మహిళా పారిశుద్ధ్య కార్మికులను దూరంగా ఉండాలంటూ చేయితో సంజ్ఞ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
మాజీ మంత్రి ఆర్కే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రోజా తన భర్త, సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణితో కలిసి వరుషాభిషేకంలో పాల్గొన్నారు. 
 
ఆ సమయంలో రోజాతో పలువురు భక్తులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు మహిళా పారిశుద్ధ్య కార్మికులు సెల్ఫీ కోసం రోజా వద్దకు వెళ్లగా వారిని దూరంగా నిల్చోవాలని చేయి చూపిస్తూ రోజా చెప్పడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో వారు కొంత దూరం జరిగి ఆమెతో సెల్ఫీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments