Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు బోగీలో చెప్పులతో కొట్టుకున్న మహిళలలు .. వీడియో వైరల్

Webdunia
గురువారం, 13 జులై 2023 (11:56 IST)
కోల్‌కతాలో పరుగులు పెట్టే లోకల్ రైలులో కొందరు మహిళలు చెప్పులతో కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను ఆయుషి అనే మహిళ కోల్‌కతా లోకల్ పేరుతో సామాజికమాద్యం ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ఇపుడు వైరల్ అయింది. జూలై 11వ తేదీన ఈ వీడియోను పోస్ట్ చేయగా, ఇప్పటికే 30 లక్షల మంది ఈ వీడియోను తిలకించారు. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం ఇద్దరు మహిళలు ఒకవైపు, మిగిలిన మహిళలంతా మరోవైపు ఉన్నట్టు కనిపిస్తుంది. 
 
లోకల్‌ రైలులోని లేడీస్ బోగీలో మహిళలు గొడవలు పడుతున్నట్టుగా ఈ వీడియోలో ఉంది. మహిళలు అరవడం, కేకలు వేయడం, ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకోవడం, పిడిగుద్దులు కురిపించడం, ఒకరి జట్లు ఒకరు పట్టుకుని లాగుతున్నట్టుగా కనిపిస్తుంది. వారి ప్రవర్తనను చూసిన కొందరు వారిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
అయితే, ఈ గొడవకు గల కారణాలు మాత్రం వెల్లడికాలేదు. ఈ ఘటనపై నెటిజన్లు తమదైమశైలిలో స్పందిస్తున్నారు. రైలులో ఉచితంగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ పోరు అని ఒకరు, క్లినిక్ ప్లస్ న్యూ యాడ్ అని మరికొంందరు అంటూ కామెంట్స్ చేశారు. గతంలో కూడా ముంబై రైళ్లలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments