విశాఖ‌లో విక్ట‌రీ ఫ్లేమ్ సైనికుల‌కు అందించిన హోం మంత్రి సుచ‌రిత‌

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (15:05 IST)
విశాఖపట్నం ఆర్.కె.బీచ్ రోడ్ లోని విక్టరీ అట్ సీ వద్ద జరిగిన కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, హోంమంత్రి భర్త, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్, విజయ నిర్మల, నేవీ అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. 
 
1971 లో ఇండో-పాక్ యుద్ధంలో భారత వైమానిక దళాలు విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో విక్టరీ ఫ్లేమ్ ను హోంమంత్రి సుచరిత గారికి సైనికులు అందించారు. ఈ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు చిహ్నంగా ఏర్పాటు చేసిన స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచంలో జరిగిన యుద్ధాలలో అతి తక్కువ సమయంలో విజయం సాధించిన యుద్ధంగా దీనిని పేర్కొనవచ్చని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. మన సైనికులు సాదించిన విజయం భారత దేశానికి గర్వకారణమన్నారు. 
 
ఈ యుద్ధంలో దాదాపు 3 వేల మంది సైనికులు వీరమరణం పొందడం తో పాటు, 12 వేల మంది గాయపడ్డారని తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల వలనే మనం ప్రశాంతంగా ఉన్నామన్నారు. త్రివిధ దళాల సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ,శత్రు దేశాల నుండి భారత దేశాన్ని రక్షిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సైనికుల త్యాగాలను మనమందరం గౌరవించాలని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments