Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ‌లో విక్ట‌రీ ఫ్లేమ్ సైనికుల‌కు అందించిన హోం మంత్రి సుచ‌రిత‌

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (15:05 IST)
విశాఖపట్నం ఆర్.కె.బీచ్ రోడ్ లోని విక్టరీ అట్ సీ వద్ద జరిగిన కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, హోంమంత్రి భర్త, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్, విజయ నిర్మల, నేవీ అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. 
 
1971 లో ఇండో-పాక్ యుద్ధంలో భారత వైమానిక దళాలు విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో విక్టరీ ఫ్లేమ్ ను హోంమంత్రి సుచరిత గారికి సైనికులు అందించారు. ఈ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు చిహ్నంగా ఏర్పాటు చేసిన స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచంలో జరిగిన యుద్ధాలలో అతి తక్కువ సమయంలో విజయం సాధించిన యుద్ధంగా దీనిని పేర్కొనవచ్చని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. మన సైనికులు సాదించిన విజయం భారత దేశానికి గర్వకారణమన్నారు. 
 
ఈ యుద్ధంలో దాదాపు 3 వేల మంది సైనికులు వీరమరణం పొందడం తో పాటు, 12 వేల మంది గాయపడ్డారని తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల వలనే మనం ప్రశాంతంగా ఉన్నామన్నారు. త్రివిధ దళాల సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ,శత్రు దేశాల నుండి భారత దేశాన్ని రక్షిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సైనికుల త్యాగాలను మనమందరం గౌరవించాలని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments