Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ‌లో విక్ట‌రీ ఫ్లేమ్ సైనికుల‌కు అందించిన హోం మంత్రి సుచ‌రిత‌

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (15:05 IST)
విశాఖపట్నం ఆర్.కె.బీచ్ రోడ్ లోని విక్టరీ అట్ సీ వద్ద జరిగిన కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, హోంమంత్రి భర్త, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్, విజయ నిర్మల, నేవీ అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. 
 
1971 లో ఇండో-పాక్ యుద్ధంలో భారత వైమానిక దళాలు విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో విక్టరీ ఫ్లేమ్ ను హోంమంత్రి సుచరిత గారికి సైనికులు అందించారు. ఈ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు చిహ్నంగా ఏర్పాటు చేసిన స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచంలో జరిగిన యుద్ధాలలో అతి తక్కువ సమయంలో విజయం సాధించిన యుద్ధంగా దీనిని పేర్కొనవచ్చని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. మన సైనికులు సాదించిన విజయం భారత దేశానికి గర్వకారణమన్నారు. 
 
ఈ యుద్ధంలో దాదాపు 3 వేల మంది సైనికులు వీరమరణం పొందడం తో పాటు, 12 వేల మంది గాయపడ్డారని తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల వలనే మనం ప్రశాంతంగా ఉన్నామన్నారు. త్రివిధ దళాల సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ,శత్రు దేశాల నుండి భారత దేశాన్ని రక్షిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సైనికుల త్యాగాలను మనమందరం గౌరవించాలని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments