Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ వరదల‌పై ప్రధానమంత్రి, హోం మంత్రితో మాట్లాడిన ఉప రాష్ట్రపతి

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (14:10 IST)
ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లోని వరద పరిస్థితిపై ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వ‌ర‌ద బాధితుల దృశ్యాలు త‌న‌ని క‌లచివేశాయ‌ని ఆయ‌న ఆవేద‌న చెందారు. వ‌ర‌ద‌ల విష‌య‌మై, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి ఈ రోజు ఉదయం ఫోన్ ద్వారా రాష్ట్రంలో వరద పరిస్థితిని  వారికి వివరించారు. 
 
 
ఆంధ్ర రాష్ట్రంలో వరద ప్రభావం తీవ్రంగా ఉందని, ఈ నేపథ్యంలో ప్రజల ప్రయోజనాలను, భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రధానికి తెలియజేశారు. అనంతరం కేంద్ర హోంమంత్రితోనూ ఫోన్లో మాట్లాడిన ఉపరాష్ట్రపతి, వరద ప్రభావం గురించి కూలంకషంగా వివరించారు. వరద సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని తెలిపారు.

 
ఉప రాష్ట్రపతి  తెలియజేసిన అంశాలపై సానుకూలంగా స్పందించిన ప్రధాని, కేంద్ర హోం మంత్రి తమ వైపు నుంచి ఇప్పటికే సహకారాన్ని అందిస్తున్నామని, భవిష్యత్తులోనూ అవసరమైన సహకారాన్ని అందజేస్తామని ఉపరాష్ట్రపతికి వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Saptami: పవన్ కల్యాణ్ అభిమానిని, తెరపై నేను కనిపించకపోవడానికి కారణమదే : సప్తమి గౌడ

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments