Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీజీ ఆ పదవి నాకొద్దు... వెంకయ్య నాయుడు?

ఉపరాష్ట్రపతి. దేశ ప్రథమ పౌరుడి పదవి తరువాత రెండవ అతిపెద్ద పదవి. భారతీయ జనతాపార్టీలో ఉపరాష్ట్రపతి పదవికి పెద్దగా అర్హులు లేరని విమర్శ వుంది. అందుకే ప్రధానమంత్రి, పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్న తరువాత వెంకయ్య నాయుడుకు ఆ పదవి అప్పజెప్పేందుకు స

Webdunia
సోమవారం, 17 జులై 2017 (13:07 IST)
ఉపరాష్ట్రపతి. దేశ ప్రథమ పౌరుడి పదవి తరువాత రెండవ అతిపెద్ద పదవి. భారతీయ జనతాపార్టీలో ఉపరాష్ట్రపతి పదవికి పెద్దగా అర్హులు లేరని విమర్శ వుంది. అందుకే ప్రధానమంత్రి, పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్న తరువాత వెంకయ్య నాయుడుకు ఆ పదవి అప్పజెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పేరును దాదాపు ఖరారు కూడా చేసేశారని తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రమే వెంకయ్య నామినేషన్ కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే వెంకయ్య మాత్రం అందుకు సుముఖంగా లేరట. 
 
ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే ఒక్కచోటే కూర్చుని ఉండిపోవాలని, కేంద్రమంత్రిగానే ఉండటం తనకు ఇష్టమన్న ఆలోచనలో ఉన్నారట. ఇదే విషయాన్ని ప్రధానికి చెప్పేందుకు వెంకయ్య సిద్థంగా ఉన్నారట. ప్రధాని, వెంకయ్యకు మధ్య మంచి సన్నిహిత సంబంధమే ఉంది. ఒకరిమాట ఒకరు ఖచ్చితంగా వింటారు. ఆ నమ్మకంతోనే వెంకయ్యను అడగకుండానే ఏకంగా ప్రధానే నిర్ణయం తీసేసుకున్నారు.
 
అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయడం వెంకయ్యకు ఏ మాత్రం ఇష్టం లేదట. నిన్న సాయంత్రం బిజెపి నేతలందరూ కలిసికట్టుగా శుభాకాంక్షలు తెలిపే ప్రయత్నం చేస్తే వెంకయ్య సున్నితంగా తిరస్కరించారట. తనకు ఏ మాత్రం ఉపరాష్ట్రపతి ఇష్టం లేదని, ఒకవేళ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడి గెలిస్తే ఖచ్చితంగా వెంకయ్య అందరికీ దూరమవ్వక తప్పదు. ఢిల్లీకే పరిమితమవ్వాల్సి ఉంటుంది. అది వెంకయ్యకు ఏ మాత్రం ఇష్టం లేదట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments