మనది వ్యవసాయ దేశం.. ఆవుకు ప్రాధాన్యం ఉంది.. కానీ?: వెంకయ్య
మనది వ్యవసాయ దేశం. ఆవుకు ప్రాధాన్యత ఉంది. అక్కడక్కడా కొన్ని సంఘటనలు జరిగితే.. గోరంతలను కొండంతలు చేస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. గోవు పేరుతో ఇతరులపై దాడిచేసే అధికారం ఎవ్వరికీ లేదని..
మనది వ్యవసాయ దేశం. ఆవుకు ప్రాధాన్యత ఉంది. అక్కడక్కడా కొన్ని సంఘటనలు జరిగితే.. గోరంతలను కొండంతలు చేస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. గోవు పేరుతో ఇతరులపై దాడిచేసే అధికారం ఎవ్వరికీ లేదని.. అలా దాడిచేసే వాళ్లు హిందువు అనిపించుకోరని వెంకయ్య అన్నారు.
గోసంరక్షణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలన్న మంత్రి గోరక్షణ పేరుతో ఇతరులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదన్నారు.
గోవు పేరుతో కొందరు అత్యాచారం చేయడం పొరపాటు. ఇంకొందరు గోవు ముఖ్యమా, మనిషి ముఖ్యమా అంటూ పోటీ పెట్టాల్సిన అవసరం లేదని వెంకయ్య చెప్పుకొచ్చారు. అంతేగాని గో రక్షణ పేరుతో మిగతా వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన పనిలేదన్నారు. అంటరానితనం పాటించే వారే అంటరానివారవవుతారని హితవు పలికారు.