Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు గవర్నరుగా వెంకయ్యనాయుడు...? జోరుగా చర్చ...

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (20:48 IST)
ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. కేంద్రంలో నెం.2 పొజిషన్ అని అందరూ అనుకుంటున్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడుని త్వరలో తమిళనాడు గవర్నరుగా కేంద్రం నియమించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడుకు గవర్నరుగా కొనసాగుతున్న కె.రోశయ్య పదవీకాలం జూలై నెలతో ముగుస్తుంది. ఈ నేపధ్యంలో ఆయన స్థానంలో వెంకయ్య నాయుడుని నియమించాలని అనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ జూన్ నాటికి తన మంత్రివర్గంలో మార్పులుచేర్పులు చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆ క్రమంలో సీనియర్లుగా ఉన్న ముగ్గురు మంత్రుల్లో ఒకరైన వెంకయ్య నాయుడును తమిళనాడు గవర్నరుగా నియమిస్తారని ఢిల్లీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
 
వెంకయ్య నాయుడు రాజ్యసభ సభ్యత్వం కూడా జూన్ నెలతో ముగుస్తుంది కనుక ఆయనను తమిళనాడు గవర్నరుగా నియమించి ఆయన స్థానంలో పట్టణాభివృద్ధి శాఖకు సమర్థుడైన వారిని ఎంపిక చేయవచ్చని అంటున్నారు. కాగా తెదేపా నుంచి ఇప్పటికే మంత్రులుగా ఉన్నవారిలో ఎవరినైనా తీసుకోవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. చూడాలి ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయో...?

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments