Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సచివాలయ ప్రాంతంలో 144 సెక్షన్‌... సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభం

Webdunia
బుధవారం, 11 మే 2016 (13:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక రాజధాని వెలగపూడి ప్రాంతంలో 144 సెక్షన్ విధించి.. సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ తాత్కాలిక రాజధాని నిర్మిస్తున్న వెలగపూడిలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కార్మికుడు మంగళవారం కాంక్రీట్‌ మిషన్‌ పడి దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో అతడి కుటుంబానికి న్యాయం చేయాలని తోటి కార్మికులు ఆందోళన చేపట్టారు. నిర్మాణ సంస్థకు చెందిన పలు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో వెలగపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో సచివాలయ నిర్మాణ పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ఆ ప్రాంతంలో బహిరంగ ప్రదర్శనలు, ఆందోళనలు, ధర్నాలు చేపట్టరాదని ఆదేశాలు జారీచేశారు. పైవేటు వ్యక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 
 
దీంతో అధికారులు వారితో చర్చించి.. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడంతో వారు శాంతించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. సీఆర్డీఏ అధికారి జేసీ శ్రీధర్‌, పోలీసు ఉన్నతాధికారులు అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Miheeka : పెళ్ళీడుకొచ్చిన శ్రీలీలకు మిహీక రానా శుభాకాంక్షలు

ద్విభాషా చిత్రంలో కీలక పాత్రలో అమ్ము అభిరామి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments