Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంగవీటి రాధాకృష్ణ - పుష్పవల్లి పెళ్లి ముహూర్తం ఖరారు

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2023 (16:06 IST)
దివంగత మాజీ నేత వంగవీటి మోహన్ రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహం ఈ నల 22వ తేదీన అంరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివాహానికి విజయవాడ సమీపంలోని మురళి రిసార్ట్ వేదిక కానుంది. 22వ తేదీ ఆదివారం రాత్రి 7.59 నిమిషాలకు వధువు పుష్పవల్లి మెడలో వంగవీటి రాధా మూడు ముళ్లు వేయనున్నారు. 
 
నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణి దంపతుల కుమార్తె జక్కం పుష్పవల్లితో వంగవీటి రాధకు గత నెల 3వ తేదీన నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. తాజాగా వీరి వివాహ ముహూర్తం ఖరారు చేశారు. ఈ జంట వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివాహానికి వంగవీటి అభిమానులతో పాటు వీఐపీల తాకిడి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో విజయవాడ - నిడమానూరు పోరంకి రోడ్డులో మురళి రిసార్ట్స్‌లో ఈ పెళ్లి వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
కాగా, గత 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వంగవీటి రాధా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాలంలో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments