Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంగవీటి రాధాకృష్ణ - పుష్పవల్లి పెళ్లి ముహూర్తం ఖరారు

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2023 (16:06 IST)
దివంగత మాజీ నేత వంగవీటి మోహన్ రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహం ఈ నల 22వ తేదీన అంరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివాహానికి విజయవాడ సమీపంలోని మురళి రిసార్ట్ వేదిక కానుంది. 22వ తేదీ ఆదివారం రాత్రి 7.59 నిమిషాలకు వధువు పుష్పవల్లి మెడలో వంగవీటి రాధా మూడు ముళ్లు వేయనున్నారు. 
 
నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణి దంపతుల కుమార్తె జక్కం పుష్పవల్లితో వంగవీటి రాధకు గత నెల 3వ తేదీన నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. తాజాగా వీరి వివాహ ముహూర్తం ఖరారు చేశారు. ఈ జంట వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివాహానికి వంగవీటి అభిమానులతో పాటు వీఐపీల తాకిడి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో విజయవాడ - నిడమానూరు పోరంకి రోడ్డులో మురళి రిసార్ట్స్‌లో ఈ పెళ్లి వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
కాగా, గత 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వంగవీటి రాధా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాలంలో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments