Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలోకి వంగవీటి రాధాకృష్ణ.. లగడపాటి మధ్యవర్తిత్వం

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (10:18 IST)
విజయవాడ నగరంలో మంచిపట్టున్న నేతగా గుర్తింపు పొందిన వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మధ్యవర్తిత్వంతో ఆయన సైకిలెక్కేందుకు సిద్ధమయ్యారు. సోమవారం అర్థరాత్రి లగడపాటితో కలిసి వంగవీటి రాధాకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారంతా గంటకు పైగా చర్చలు జరిపారు. 
 
ఈ చర్చలతో సంతృప్తి చెందిన వంగటీవి రాధాకృష్ణ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అదేసమయంలో వంగవీటి రాధాకు మచిలీపట్లం లోక్‌సభ స్థానం కేటాయించే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. 
 
కాగా, వైకాపాకు రాజీనామా చేసిన వంగవీటి రాధా గతకొంతకాలంగా టీడీపీలో చేరవచ్చనే ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది. అయితే, ఆ పార్టీలో చేరాలంటే విజయవాడలో సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న కొండప్రాంత వాసులకు ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని రాధా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. 
 
ఆయన డిమాండ్‌పై సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. కొండ ప్రాంత వాసులకు ఇళ్లపట్టాలు మంజూరు చేయించారు. దీంతో తన తండ్రి చివరి కోరికను తీర్చిన పార్టీగా టీడీపీ ఉంది కనుక తాను టీడీపీ‌లో చేరేందుకు సిధ్దమయ్యానని తన కార్యకర్తలకు చెప్పినట్లు తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments