Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్నని చంపిన టీడీపీలో ఎలా చేరుతా? : వంగవీటి రాధ

విజయవాడలో వైకాపాకు పట్టుకొమ్మలా ఉన్న సీనియర్ నేత వంగవీటి రాధ పార్టీ మారబోతున్నారంటూ ఓ ప్రచారం సాగింది. ముఖ్యంగా, ఆయన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ అధికార టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం

Webdunia
బుధవారం, 17 జనవరి 2018 (16:14 IST)
విజయవాడలో వైకాపాకు పట్టుకొమ్మలా ఉన్న సీనియర్ నేత వంగవీటి రాధ పార్టీ మారబోతున్నారంటూ ఓ ప్రచారం సాగింది. ముఖ్యంగా, ఆయన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ అధికార టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం సాగింది. 
 
దీనిపై వంగవీటి రాధ స్పందించారు. "మా నాన్నని చంపిన టీడీపీలో ఏ రకంగా నేను జాయిన్ అవుతాను. నాకు టీడీపీలో జాయిన్ అవ్వాల్సిన అంతా కర్మ పట్టలేదు. ఇంకోక్కసారి ఇలాంటి చెత్త వార్తలు రాస్తే పరువు నష్టదావా వేస్తా. జగన్‌ మోహన్‌ రెడ్డి నా సోదరుడు. నా ప్రాణం ఉన్నంతా వరకు వైసీపీలోనే ఉంటా. బెజవాడ 2019లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలిచి కృష్ణా జిల్లాలో మిగిలిన సీట్లను సైతం గెలిపించేందుకు నా సర్వశక్తులు వాడ్డుతా అంటూ ప్రకటించారు. 
 
అయితే, ఓ వర్గం నేతలు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. వంగవీటి రాధ అసంతృప్తిగా ఉన్నారని తెలుసుకున్న వైకాపా అధినేత వైఎస్ జగన్, రెండుసార్లు తన వద్దకు పిలిపించుకుని స్వయంగా బుజ్జగించినా, ఆయన వినలేదని, పార్టీ మారేందుకే మొగ్గు చూపారని తెలుస్తోంది. మల్లాది విష్ణును పార్టీలోకి తెచ్చినా, రాధ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని జగన్ హామీ ఇచ్చారని, అయితే, విష్ణుకు విజయవాడ సెంట్రల్ ఆఫర్ చేయడంతోనే వివాదం పెరిగిందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments