Webdunia - Bharat's app for daily news and videos

Install App

యురేనియం తవ్వకాలతో తెలుగు రాష్ట్రాలకు ముప్పు: పవన్ కళ్యాణ్

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (07:59 IST)
యూరేనియం తవ్వకాలు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. యురేనియం తవ్వకాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. 
 
జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ కలిశారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. 
 
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ యురేనియం తవ్వకాల వల్ల కృష్ణా జలాలు కలుషితమవుతాయని తెలిపారు. గర్భిణులు ఆ కలుషిత నీరు తాగితే పుట్టే బిడ్డ మానసిక వైకల్యానికి గురయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. 
 
రేడియేషన్‌తో మహిళల్లో గర్భసంచి సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేశారు. ఈ విషయం చాలా మంది జనసేన పార్టీ దృషికి తీసుకు వచ్చినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఈ ఉపద్రవాలను దృష్టిలో పెట్టుకొని యురేనియం తవ్వకాల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లనుంది..? కృష్ణా జలాలు ఎలా కలుషితం కాబోతున్నాయి..?. ఆ నీరు తాగిన ప్రజలకు ఎలాంటి జబ్బులు రాబోతున్నాయి..?  అన్నదానిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి పర్యావరణ శాస్ర్తవేత్తలు, నిపుణులతో మాట్లాడి ప్రజల్లోకి వెళ్తామని చెప్పుకొచ్చారు.

అయితే రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు నిర్వహించేది రెండు, మూడు రోజుల్లో తెలియజేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవితో నృత్యం చేసిన నిర్మాత అల్లు అరవింద్ (Video)

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments