Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కంటి దర్శనానికి భక్తుల అనుమతి.. 300 మందికే దర్శనం

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (14:27 IST)
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ముక్కంటి దర్శన భాగ్యం భక్తులకు దక్కనుంది. బుధవారం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు శాంతి అభిషేకాల తర్వాత ఉద్యోగులు, మీడియా ప్రతినిధులతో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. 11వ తేదీ గురువారం నుంచి స్థానికులకు దర్శనాలు కల్పించనున్నారు. 12వ తేదీ నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించనున్నారు. 
 
వృద్ధులు, పది సంవత్సరాల లోపు పిల్లలకు ఆలయ ప్రవేశాన్ని నిషేధించనున్నారు. ఆధార్ కార్డు తీసుకురావడంతోపాటు మాస్కు ధరించిన వారికే ఆలయ ప్రవేశం ఉంటుందని తెలిపారు. భక్తునికి.. భక్తునికి మధ్య క్యూలైన్లలో ఆరడగుల భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
 
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఆలయ అధికారులు భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. ఒక గంటకు మూడు నుంచి ఐదొందల మందికి మాత్రమే దర్శన సౌకర్యం లభించనుంది. రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు అన్ని రకాల టిక్కెట్లతో కలిపి మొత్తం గంటకు 300ల మందికి మాత్రమే అనుమతి లభించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments