Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీని జగన్ కలిస్తే టీడీపీ నేతలకు గుబులెందుకు : వెంకయ్య ప్రశ్న

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒక రాష్ట్రానికి చెందిన విపక్షనేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి కలిస్తే ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీనేతలకు గుబులు ఎందుకని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. అసలు ఈ అంశ

Webdunia
శనివారం, 20 మే 2017 (15:24 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒక రాష్ట్రానికి చెందిన విపక్షనేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి కలిస్తే ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీనేతలకు గుబులు ఎందుకని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. అసలు ఈ అంశంపై రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. 
 
ఐక్యరాజ్యసమితి ఆవాస అధ్యక్షుడిగా వెంకయ్యనాయుడు ఎంపికైన సందర్భంగా విజయవాడలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకయ్య.. విపక్షనేత ప్రధానిని జగన్ కలిస్తే ఎందుకు తర్జనభర్జన పడుతున్నారో అర్ధంకావడం లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు ఏ పార్టీ మద్దతు ఇచ్చినా తీసుకుంటామని స్పష్టం చేశారు.
 
ప్రస్తుతం టీడీపీతో పొత్తు కొనసాగుతుంది.. 2019 ఎన్నికలప్పుడు పొత్తు ఎవరితో అన్నది ఆలోచిస్తామన్నారు. ఈనెల 25న విజయవాడలోజరగనున్న కార్యకర్తల సమావేశానికి అమిత్‌షా హాజరవుతారని తెలిపారు. మహాకూటమితో ఎన్డీఏకు ఇబ్బంది లేదంటూ వెంకయ్య చెప్పుకొచ్చారు.
 
ఇకపోతే.. దక్షిణాదిలో బీజేపీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీలో పర్యటిస్తారని, సభలో పాల్గొంటారని చెప్పారు. బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా భేటీ అవుతారని, ఆహ్వానం ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారని చెప్పారు. 
 
దక్షిణాదిలో 120 ఎంపీ స్థానాల్లో ఉన్నామని, దేశంలో ఎన్డీయే మినహా ఇతర పక్షాలన్నీ దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని, ప్రతిపక్ష పార్టీలన్నీ మహాకూటమి ఏర్పాటు చేస్తామంటున్నాయని అన్నారు. తమిళనాడు రాజకీయాల్లో కలుగజేసుకోమని తేల్చి చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments