Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే పందుల పందేలు ఆడుకోండి.. సుజనా చౌదరి కామెంట్స్

తమిళ సంప్రదాయ క్రీడాపోటీలు జల్లికట్టు కోసం ఆ రాష్ట్ర యువత చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ప్రత్యేక హోదా కోసం మౌననిరసన ఉద్యమాన్ని చేపట్టనుంది. దీనిపై కేంద్ర మంత్రి, టీడీప

Webdunia
గురువారం, 26 జనవరి 2017 (10:28 IST)
తమిళ సంప్రదాయ క్రీడాపోటీలు జల్లికట్టు కోసం ఆ రాష్ట్ర యువత చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ప్రత్యేక హోదా కోసం మౌననిరసన ఉద్యమాన్ని చేపట్టనుంది. దీనిపై కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
జల్లికట్టు స్ఫూర్తి కావాలనుకుంటే వెళ్లి అదే ఆడుకోవాలని సుజనా ఎద్దేవా చేశారు. లేకపోతే కోళ్ల పందెలు, పందుల పందేలు ఆడుకోవచ్చని సుజనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చూస్తూ ఊరుకోరని, రాష్ట్రానికి ఏ సెక్షన్ కింద ఏ రూల్ కింద అన్యాయం జరిగిందో చెబితే సమాధానం చెబుతానని ఆయన సవాల్ చేశారు. 
 
ప్రత్యేక హోదా ముగిసిన అంశమని కేంద్రమంత్రి సుజనాచౌదరి మరోసారి పునరుద్ఘాటించారు. రాజకీయ పార్టీలు అనవసరంగా విద్యార్థులను, యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని సుజనా ఆరోపించారు. ఇలాంటి ఆందోళన కార్యక్రమాల వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం శూన్యమన్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments