Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగా చేయడం వల్లే మోడీ - చంద్రబాబు రెచ్చిపోతున్నారట.. సుజనా అలా ఎందుకన్నారు!

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (11:32 IST)
అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున కేంద్ర మంత్రి సుజనా చౌదరి యోగాసనాలు వేశారు. తిరుపతిలోని అన్ని ఆధ్యాత్మిక సంఘాలు, వాకర్స్, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఏకతాటిపైకి వచ్చి వేలాది మందితో యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రితో పాటు... టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ ముద్దు కృష్ణమనాయుడు, గౌనివాని శ్రీనివాసులు, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మలతో పాటు పలువురు ముఖ్యనేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని యోగ చేశారు. కార్యక్రమ అనంతరం యోగ గురువులను, కార్యక్రమ నిర్వాహకులను సుజనా చౌదరీ సన్మానించారు. 
 
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. ప్రతిరోజూ యోగ చేయడం వల్లే ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులు అలుపెరగకుండా కష్టపడి పని చేయగలుగుతున్నారన్నారు. అందువల్ల బాల్యం నుంచే పిల్లలకు యోగ నేర్పితే చదులో ఏకాగ్రత, ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం సాధ్యమన్నారు. యోగాకు నిర్ణీత సమయాన్ని ఎలా కేటాయిస్తారో... అలాగే నెట్ చూడటానికి కూడా పిల్లలు ఖచ్చితంగా ఓ నిర్ణీత సమయం కేటాయించేలా ఈ రోజు నుంచి పెద్దలు చర్యలు తీసుకుంటే ఎంతో మంచిదని సూచించారు. యోగ డే తర్వాత కూడా యోగను కొనసాగించాలని ఆయన అందిరిని కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments