Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరంపై శుభవార్త చెప్పిన కేంద్ర జలమంత్రి

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (19:31 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖామంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శుభవార్త చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చునంతటినీ భరిస్తానని వెల్లడించారు. శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ తర్వాత పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి షెకావత్ మాట్లాడుతూ, పోలవరం నిర్మాణానికి ఉపయోగించే ప్రతి రాయి ఖర్చును కేంద్రం భరిస్తుందన్నారు. గతంలో చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును కేంద్రం దశల వారీగా విడుదల చేస్తుందన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిశీలించామన్నారు. పనుల పురోగతిలో అడ్డంకులను అధికమించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments