Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్‌పై అనుమానాలుంటే జైట్లీని కలవండి : వెంకయ్య ఉచిత సలహా!

Webdunia
ఆదివారం, 1 మార్చి 2015 (14:19 IST)
తాజాగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఏవైనా అనుమానాలు ఉంటే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలవాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఉచిత సలహా ఇచ్చారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘సమస్యలుంటే చర్చించుకుందాం. బహిరంగ విమర్శలతో ఫలితం శూన్యం. బడ్జెట్‌లో ఏదైనా అనుమానాలుంటే అరుణ్ జైట్లీని కలవండి’ అంటూ ఓ ఉచిత సలహా ఇచ్చారు.
 
శనివారం జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌పై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నిధుల కేటాయింపులో కేంద్రం తమకు మొండిచేయి చూపిందని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వ్యాఖ్యానించారు. 
 
ఇరువురు సీఎంల ఆగ్రహావేశాలను తగ్గించేందుకు వెనువెంటనే వెంకయ్య రంగంలోకి దిగారు. నిధుల కేటాయింపుపై జైట్లీతో మాట్లాడమని ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పానన్నారు. నిధుల కేటాయింపులకు సంబంధించి సవరణలు చేసేందుకు యత్నిస్తామని కేసీఆర్‌కు చెప్పానన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెంకయ్య హామీ ఇచ్చారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments