Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంవత్సరానికొకసారి తద్దినం పెట్టినట్టు స్వచ్ఛ భారత్ చేస్తే కుదరదు: వెంకయ్య నాయుడు

యేడాదికి ఒక సారి తద్దినం పెట్టినట్టు స్వచ్ఛ భారత్ చేస్తే కుదరదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో స్వచ్ఛాగ్రహ లఘు చిత్రాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (17:28 IST)
యేడాదికి ఒక సారి తద్దినం పెట్టినట్టు స్వచ్ఛ భారత్ చేస్తే కుదరదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో స్వచ్ఛాగ్రహ లఘు చిత్రాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘స్వచ్ఛ భారత్’ అనేది ప్రతిరోజూ చేయాల్సిన కార్యక్రమం అని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. 
 
అలాకాకుండా, సంవత్సరానికొకసారి తద్దినం పెట్టినట్లో, శ్రాద్ధం పెట్టినట్లో, లేకపోతే, వ్రతం చేసినట్లో ఈ కార్యక్రమం చేస్తామంటే కుదరదని అన్నారు. ‘మనం రోజూ గడ్డం గీసుకోవాలి కదా. మన గడ్డం మనమే గీసుకోవాలి కదా, లేకపోతే, వేరే వాళ్లకు డబ్బులిచ్చి గీసుకోవాలి. గవర్నమెంట్ వచ్చి మనకు గడ్డం గీయదు కదా! ఇంకా ఆ స్కీమ్ రాలేదు. భవిష్యత్‌లో పెడతారేమో తెలియదు. అక్టోబర్ 2న గడ్డం గీసుకున్నాను.. మళ్లీ వచ్చే అక్టోబర్ 2వరకు గడ్డం గీసుకోనని ఎవరైనా ఉండిపోతే, ఏమవుతుంది!.. సాధువు అయిపోతారు. అందుకని, పరిశుభ్రతనేది ప్రతిఒక్కరి జీవితంలో దినచర్య కావాలి’ అంటూ వెంకయ్యనాయుడు తనదైన శైలిలో మాట్లాడారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments