మంచో చెడో చేయాల్సింది చేశాడు.. వెళ్లిపోయాడు : జగన్‌పై ఆర్ఆర్ఆర్ కామెంట్స్

వరుణ్
గురువారం, 13 జూన్ 2024 (15:46 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై జగన్ గురించి మాట్లాడటం దండగ అని ఒక ముక్కలో చెప్పేశారు. మంచో చెడో చేయాల్సింది చేశాడు.. వెళ్లిపోయాడు.. ఇకపై అతని గురించి మాట్లాడటం వేస్ట్ అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, మంచో చెడో చేయాల్సింది చేశాడు. వెళ్లిపోయాడు. ఇపుడు ప్రజలు ఆ విషయం పట్టించుకోరు. ప్రజల దృష్టి ఇపుడు మాపై ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటుందా? ఎలా నెరవేర్చుతుందనేదే చూస్తారు. అందుకే మేం కూడా మా హామీలను అమలు చేసే విషయంపై దృష్టిని కేంద్రీకరించాం అని చెప్పారు. 
 
ఇకపై జగన్‌పై కానీ, వైకాపాపైన కానీ, ప్రజల దృష్టి ఉండదు. ఉండకూడదు అని పేర్కొన్నారు. ప్రజలు కూటమికి అధికారం ఇచ్చారు. అందుకే మనం దాడులకు పాల్పడవద్దని కోరుతున్నం. పైగా ప్రజలు గొప్ప బాధ్యతలను అప్పగించారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పారని, అందుకే తనపై జరిగిన కస్టోడియల్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు రఘురామకృష్ణంరాజు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments