జేపీతో మాట్లాడాక చెపుతా... : ఉండవల్లి అరుణ్ కుమార్

లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్‌తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం సమావేశం కానున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధన కోసం ఒక జేఏసీని ఏర్పాటు చేయాలని భావ

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (09:51 IST)
లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్‌తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం సమావేశం కానున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధన కోసం ఒక జేఏసీని ఏర్పాటు చేయాలని భావిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఇప్పటికే జేపీతో పవన్ చర్చలు జరుపగా, ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం పవన్‌తో భేటీ అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో ఇక పవన్ విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై జయప్రకాశ్‌తో చర్చించాలని ఉండవల్లి నిర్ణయించారు. పవన్‌తో భేటీ అనంతరం జయప్రకాశ్ మాట్లాడుతూ.... పవన్ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లి, జయప్రకాశ్ కలవడం కొత్త చర్చలకు తెరలేపింది. పవన్ తనతో మాట్లాడిన అంశాలను జేపీ దృష్టికి తీసుకు వెళ్లనున్న ఉండవల్లి, ఆయనతో మాట్లాడిన తర్వాతనే జేఏసీలో చేరాలా? వద్దా? అన్న విషయమై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

Prabhas: డార్లింగ్ ప్రభాస్ తొలి క్రష్ ఎవరో తెలుసా?

Raviteja : పాటకు రిథమ్ లేదు, అర్థంలేదు.. మౌత్ టాకే... సూపర్ డూపర్‌ అంటున్న మాస్ జాతర

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments