Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరానికి వంద శాతం నిధులిచ్చి కేంద్రమే పూర్తి చేస్తుంది : ఉమాభారతి

Webdunia
గురువారం, 5 మే 2016 (15:44 IST)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేయడమేకాకుండా, ఆ ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేసి తీరుతుందని కేంద్రమంత్రి ఉమాభారతి స్పష్టంచేశారు. 
 
ఇదే అంశంపై ఆమె గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ ఆర్థికపరమైన అంశాల పట్ల ఆర్థికశాఖతో జలవనరుల మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోందన్నారు. 70:30 శాతం నిధుల నిష్పత్తిపై ఆర్థిక శాఖకు, ప్రధాని కార్యాలయానికి వివరణ ఇచ్చామన్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించామన్నారు. 
 
మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఒడిషా ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కదా అని ప్రశ్నించగా, ఈ మాట నిజమే అయినప్పటికీ.. ఇప్పటికే ఆ రాష్ట్ర ఎంపీలను పిలిపించుకుని అన్నీ వివరించామన్నారు. మరోసారి వారిని పిలిచి మాట్లాడతామని కూడా ఆమె చెప్పారు. 
 
అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. విభజన చట్టం మేరకు పోలవరాన్ని కేంద్రం పూర్తి చేసి తీరుతుందని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం మంజూరు చేస్తుందన్నారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments