పవన్‌కు తప్పిన పెను ప్రమాదం.. ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో...

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (15:38 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో పవన్‌కు ముప్పు తప్పింది. 
 
ప్రస్తుతం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆయన కాన్వాయ్ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం సమీపంలోకి రాగానే... కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. అయితే కార్లలోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది.
 
మరోవైపు జనసేన, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సినీరంగ సమస్యలను ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పవన్ పై మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. 
 
దీనికి తోడు సినీ నటుడు పోసాని కూడా పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించడం, జగన్‌ను ఏమైనా అంటే ఊరుకోబోమని హెచ్చరించడం తెలిసిందే. వీటన్నింటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటన చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments