Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కాంట్లాండ్‌లోని అప్పిన్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థుల మృతి

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (07:43 IST)
స్కాట్లాండ్ దేశంలోని అప్పిన్‌ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులతో సహా మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మూడో విద్యార్థి బెంగుళూరు వాసిగా గుర్తించారు. వీరంతా కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన హైల్యాండ్‌లోని అప్పిన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన 30 యేళ్ల సుధాకర్, హైదరాబాద్‌కు చెందిన పవన్ బాశెట్టి (23)లు దుర్మరణం పాలయ్యారు. అలాగే, బెంగుళూరుకు చెందిన గిరీశ్ సుబ్రహ్మణ్యం (23) అనే మరో విద్యార్థి కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 
 
హైదరాబాద్‌కు చెందిన సాయివర్మ (14) అనే విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్కాంట్లాండ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, పవన్, గిరీశ్‌లు లీసెస్టర్ యూనివర్శిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. సుధాకర్‌కు మాత్రం మాస్టర్స్ డిగ్రీ పూర్తయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments