Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కాంట్లాండ్‌లోని అప్పిన్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థుల మృతి

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (07:43 IST)
స్కాట్లాండ్ దేశంలోని అప్పిన్‌ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులతో సహా మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మూడో విద్యార్థి బెంగుళూరు వాసిగా గుర్తించారు. వీరంతా కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన హైల్యాండ్‌లోని అప్పిన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన 30 యేళ్ల సుధాకర్, హైదరాబాద్‌కు చెందిన పవన్ బాశెట్టి (23)లు దుర్మరణం పాలయ్యారు. అలాగే, బెంగుళూరుకు చెందిన గిరీశ్ సుబ్రహ్మణ్యం (23) అనే మరో విద్యార్థి కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 
 
హైదరాబాద్‌కు చెందిన సాయివర్మ (14) అనే విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్కాంట్లాండ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, పవన్, గిరీశ్‌లు లీసెస్టర్ యూనివర్శిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. సుధాకర్‌కు మాత్రం మాస్టర్స్ డిగ్రీ పూర్తయింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments