Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేల్స్ రిప్రజెంటేటివ్స్ పేరిట.. విజయవాడలో మహిళపై దారుణం

విజయవాడ సత్యనారాయణ పురంలో దారుణం జరిగింది. సేల్స్ రిప్రజెంటేటివ్స్ పేరిట ఇంట్లోకి ప్రవేశించి పద్మావతి అనే మహిళను హత్య చేసేందుకు ఇద్దరు ఆగంతుకులు ప్రయత్నించారు. ఇద్దరు యువకులు పద్మావతి (48) ఇంట్లోకి దొంగతనానికి చొరబడ్డారు. అది గమనించిన ఆమె వారిద్దరిపై

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (20:34 IST)
విజయవాడ సత్యనారాయణ పురంలో దారుణం జరిగింది. సేల్స్ రిప్రజెంటేటివ్స్ పేరిట ఇంట్లోకి ప్రవేశించి పద్మావతి అనే మహిళను హత్య చేసేందుకు ఇద్దరు ఆగంతుకులు ప్రయత్నించారు. ఇద్దరు యువకులు పద్మావతి (48) ఇంట్లోకి దొంగతనానికి చొరబడ్డారు. అది గమనించిన ఆమె వారిద్దరిపై ఎదురు తిరిగింది. 
 
పెద్దగా అరుస్తూ కేకలు పెట్టింది. దీంతో ఆ ఆగంతుకులు మహిళ మెడ కత్తితో కోసి అక్కడి నుంచి పరారయ్యారు. పద్మావతి అరుపులు విన్న చుట్టుప్రక్కల వారు వచ్చేసరికి ఆమె రక్తపు మడుగులో పడి వుంది. దీనితో హుటాహుటిన ఆమెను ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 
పద్మావతి ఇంట్లో హత్యాప్రయత్నం తర్వాత దుండగులు మరో అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లారు. అక్కడ పని చేసే వాచ్‌మెన్‌ మీరు ఎవరని నిలదీయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments