Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కనుమ రోడ్డులో ఇద్దరు మోటారిస్టులపై చిరుత దాడి

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (08:30 IST)
ఇటీవలికాలంలో తిరుమల తిరుపతి కనుమ రహదారుల్లో చిరుత పులి దాడి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇద్దరు ద్విచక్రవాహనదారులపై చిరుతపులి దాడిచేసింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఈ చిరుత దాడిలో గాయపడిన వారిలో ఎఫ్ఎంఎస్ సిబ్బంది ఆనంద్, రామకృష్ణలు ఉన్నారు. 
 
వీరిద్దరూ బైక్‌పై రెండో ఘాట్ రోడ్డు మీదుగా వెళుతుండగా వినాయకుడి ఆలయం దాటిన తర్వాత వారిద్దరిపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో వారిద్దరూ స్వల్పంగా గాయపడ్డారు. చిరుత రోడ్డు దాటుతున్న సమయంలో వీరు కనిపించడంతో దాడి చేసి ఉండొచ్చని వీజీవో బాలారెడ్డి తెలిపారు. 
 
కాగా, ఇటీవలి కాలంలో శేషాచలం అటవీ ప్రాంతాల్లో చిరుతపులల సంసారం ఎక్కువైందిని భక్తులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. దీంతో తిరుమల అధికారులతో పాటు అటవీశాఖ అధికారులు కూడా అప్రమత్తమై భక్తులన జాగ్రత్తగా ఉండాలంటూ పదేపదే హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిరుతపులి దాడి కలకలం రేపింది. ఈ దాడిలో గాయపడిన వారిద్దరినీ విజిలెన్స్ అంబులెన్స్‌లో ఆశ్విని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments